ప్రజాశక్తి-విజయనగరం కోట : బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం టిడిపి విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి అతిథి గజపతి 19, 18వ డివిజన్లైన లంకాపట్నం, హుకుంపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళ వద్దకు వెళ్లి దోసెలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.