ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని దిగుడు పుట్టు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుమారు 25 మందికి బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చలి దుస్తులను పంపిణీ చేశారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సలీం విద్యార్థులకు క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు యు.మహేష్, కంఠం నాయుడు, కోటి, ఈశ్వరరావు, రాంబాబు, తిరుపతి రావు, బొంజు బాబు, రామన్నపడాల్ పాల్గొన్నారు.