తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభం

Feb 8,2024 15:18 #bac meeting, #ts assembly

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్‌ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సీపీఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు హాజరయ్యారు. అసెంబ్లీ పనిదినాలు, ఎజెండాపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

➡️