ప్రజాశక్తి-పాడేరు టౌన్: నాటు తుపాకులను స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లలో వారం రోజుల్లో అప్పగించాలని, స్వచ్ఛందంగా తీసుకొచ్చి అప్పగించిన వారిపై ఎటువంటి కేసు ఉండదని పాడేరు సిఐ డి.నవీన్ కుమార్ తెలిపారు.. పాడేరు మండలం కుజ్జెలి పంచాయతీకి చెందిన ముగ్గురు, ఇస్కలు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల పిలుపు మేరకు స్పందించి ఐదు నాటు తుపాకులను తీసుకొచ్చి అప్పగించినట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా, పోలీసు యంత్రాంగం పిలుపుతో నాటు తుపాకులు అప్పగించారని అన్నారు. వారిని సిఐ అభినందించారు. ఇంకా ఎవరి వద్దనైనా నాటు తుపాకులు, తపంచాలు కలిగి ఉంటే వాటిని పోలీసు స్టేషన్ లో అప్పగించాలని కోరారు. ఇచ్చిన గడువు లోపల అప్పగించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు పాల్గొన్నారు.8 నాటు తుపాకీలు అప్పగింతరాజవొమ్మంగి:మండలంలోని జడ్డంగి, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పలు గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఎనిమిది నాటు తుపాకీలను సోమవారం అప్పగించినట్లు రాజవొమ్మంగి సిఐ ఎన్ సన్యాసినాయుడు తెలిపారు. నాటుతుపాకులు, లైసెన్స్ లేని ఆయుధాలు ఎవరిదగ్గరైనా ఉంటే వారం రోజుల లోపు సంబంధిత పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛందంగా డిపాజిట్ చేయాలని ఇటీవల జిల్లా పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిండ్ర గ్రామం నుండి 2 నాటుతుపాకులు, జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో వాతంగి, ఓకుర్తి గ్రామాల నుండి 6 నాటుతుపాకులను స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశారు. రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్ఐలు ్ వెంకయ్య, రఘునాధరావు పాల్గొన్నారు.