ప్రజాశక్తి – కాకినాడ
ఈ నెల 10న తుని నియోజకవర్గంలో జరుగుతున్న సభను విజయవంతం చేయాలని మాజీ ఎంఎల్ఎ వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. టిడిపి కార్యాలయంలో అర్బన్ నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకుతోడు వైసిపి ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశం పార్టీకి గెలుపు బాటలు కాబోతున్నాయని అన్నారు. ఈ నెల 10న తుని నియోజకవర్గంలో జరుగుతున్న బహిరంగ సభకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారని, ఈ సమావేశానికి పెద్దఎత్తున టిడిపి కార్యాకర్తలు, అభిమానులు, ప్రజలను కదిలించేలా నాయకత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు అయితాబత్తుల ఆనందరావు, నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపిలో మొదలైన తిరుగుబాట్లు, అసంతృప్తి జ్వాలల్లో ఆ పార్టీ పూర్తిగా కాలి బూడిద కావడం ఖాయమని, జగన్ అరాచక విధానాలకు సొంత చెల్లి, తల్లి చీకొట్టారని, తన వెంట నడిచిన నాయకులంతా జారిపోతున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్ని, కాకినాడలో దోపిడీ పాలన సాగిస్తున్న ద్వారంపూడిని తరిమి కొట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తాజద్దీన్, గదుల సాయిబాబా, దండిప్రోలు నాగబాబు, తుమ్మల రమేష్, గుజ్జు బాబు, అంబటి చిన్నా, ఒమ్మి బాలాజీ, సీకోటి అప్పలకొండ, కొల్లు కుమారి, రిక్కా లక్ష్మి, మెంటారావు, గాది శివ, గుత్తుల రమణ, తదితరులు పాల్గోన్నారు.