తీరుమారని తెలుగు టైటన్స్‌

Dec 6,2023 22:22 #Sports

పట్న పైరెట్స్‌ చేతిలోనూ ఓటమే..ప్రొ కబడ్డీ సీజన్‌-10

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-10లోనూ తెలుగు టైటాన్స్‌ ఆటతీరు మారలేదు. భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ పవన్‌ షెహ్రావత్‌ చేరికతోనైనా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందనుకున్న టైటాన్స్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. బుధవారం పట్నా పైరెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు 47-28 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లో పట్నాపై ఆధిక్యతను సంపాదించిన టైటాన్స్‌.. ఆ తర్వాత వరుసగా పాయింట్లను చేజార్చుకొని మ్యాచ్‌ను కోల్పోయింది. తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ పవన్‌ షెహ్రావత్‌(11రైడ్‌ పాయింట్లు)కి తోడు సందీప్‌ ధుల్‌(4డిఫెన్స్‌) పాయింట్లు సాధించాడు. ఇక పట్నా జట్టులో సచిన్‌(14), మంజిత్‌(8) రైడ్స్‌లో రాణించగా.. డిఫెన్స్‌లో కెప్టెన్‌ నీరజ్‌(4), సందీప్‌ కుమార్‌(4) అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక అంకిత్‌(5) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు.

➡️