తిరుమలలో అనర్హులకు అందలండబ్బున్నోడికి పాపనాశనంలో షాపులుమంత్రి ఆదేశాలతో అటవీశాఖ అత్యుత్సాహం

తిరుమలలో అనర్హులకు అందలండబ్బున్నోడికి పాపనాశనంలో షాపులుమంత్రి ఆదేశాలతో అటవీశాఖ అత్యుత్సాహం

తిరుమలలో అనర్హులకు అందలండబ్బున్నోడికి పాపనాశనంలో షాపులుమంత్రి ఆదేశాలతో అటవీశాఖ అత్యుత్సాహంప్రజాశక్తి – తిరుపతి బ్యూరోవడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా ఃపక్కా కమర్షియల్‌ఃగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల పాపనాశనంలో అనర్హులను అందలమెక్కించారు. సాధారణంగా తిరుమల నమ్ముకున్న స్థానిక పేదలకే షాపులు ఇవ్వాల్సి ఉంది. అయితే అటవీ శాఖ ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలు లంచం తీసుకుని షాపులకు నవంబర్‌లో లైసెన్స్‌లు ఇచ్చేశారు. తిరుమల తిరుపతి వాసులకు కాకుండా పీలేరు, మదనపల్లి, పుంగనూరు ప్రాంతాలకు చెందిన రాజకీయ పలుకుబడి ఉన్న వారికే షాపులు కేటాయించడం గమనార్హం. అయితే జిల్లాలో కీలకమైన ఓ మంత్రి ఆదేశాల మేరకే ఫారెస్టు అధికారులు పాపనాశనం వద్ద 30-40 మందికి అధికారికంగా లైసెన్స్‌లను ఇచ్చేశారు. వారిలో థమ్సప్‌, కోకోకోలా, మాజీ, కిన్‌లే, కురకురే, లేస్‌ ఏజెంట్లయిన సుబ్రమణ్యం, రమణలకు అధికంగా షాపులు కేటాయించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఃమా ఇష్టంః అన్నట్లుగా అటవీ అధికారుల తీరు ఉంది. గతంలో శ్రీవారికి ఃసంరక్షకులుఃగా అటవీ ప్రాంతంలో కొంతమందిని తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్లింది. అక్కడే కాపురాలు ఉండేలా చేసి అంగళ్లను కేటాయించారు. స్థానికులకే పెద్దపీట వేస్తూ తిరుమల, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి గుడి, అలిపిరి పాదాల మండపం, పాపనాశనం, శిలాతోరణం ప్రాంతాల్లో టిటిడినే వీరికి ఉచితంగా లైసెన్స్‌లు ఇచ్చి తిరుమల అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. ఇది ఆనవాయితీగా కొనసాగుతూ వంశపారపర్యంగా వర్తింపజేసింది. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాత్రాస్థలం కావడం, కోట్లాది రూపాయలు సమకూరుతుండడంతో తిరుమలలో వ్యాపారానికి గిరాకీ పెరిగింది. హోటళ్లు, బజ్జీలు, టీ అంగళ్లు, టోపీలు, బొమ్మలు, గిల్ట్‌ నగలు, శ్రీవారి చిత్రపటాలు, ఫొటోస్టూడియోలు, టిఫిన్‌ అంగళ్లు స్థానికులకే అప్పగించారు. రోజువారీ ఆదాయం వేలల్లో ఉండడంతో తిరుమలలో ఒక్క షాపు సంపాదించుకుంటే నెలకు నాలుగైదు లక్షల సంపాదన వచ్చే స్థాయికి పెరిగింది. దీంతో రాజకీయ నాయకుల కన్ను పడింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అనుచరులు బినామీ పేర్లతో షాపులు పెట్టుకుంటూ అసలైన లబ్దిదారులను పక్కకు నెట్టేశారు. పాపనాశనం వద్ద ఎపి పరిధిలో ఉన్న ఫారెస్టు శాఖ పరిధిలో 40 షాపుల సంఖ్యను పెంచారు. కొత్త షాపుల్లో ఒక్కరు కూడా స్థానికులు లేరు అందరూ పీలేరు, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ అనుచరులే ఉన్నారు. జిల్లాలో కీలకమైన మంత్రి అదే శాఖలో ఉండడంతో వీరి పని సునాయాసం అయ్యింది. వారికి సంబంధించిన వారికి గత ఏడాది నవంబర్‌ 6న రేంజర్‌ స్థాయిలో షాపులు ఇస్తున్నట్లు కలెక్టర్‌కు నివేదికలు పంపారు. ఈ మేరకు కలెక్టర్‌ ఓకే చేశారు. స్థానికేతరులకు ఇస్తారేమని స్థానికులు ప్రశ్నించగా ఒక్క షాపుకు ఐదు లక్షలు ఇచ్చి కొనుగోలు చేశామని, తమ ఇష్టమని ఎదురు దాడికి దిగారు. బ్యాగ్రౌండ్‌ మంత్రే కీలకంగా ఉండడంతో స్థానికులు ఏం చేయలేక వెనకడుగు వేసి మిన్నకుండిపోవడం గమనార్హం.

➡️