తిరుపతి అబ్బాయి.. యుకె అమ్మాయి…ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లిప్రజాశక్తి- తిరుపతి టౌన్: ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళుత్తున్న మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిల ప్రేమలో పడుతున్నారు.. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒక్కటవుతున్నారు. ఇదే తరహాలో సాప్ట్వేర్ ఉద్యోగ రీత్యా యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)కు వెళ్ళిన తిరుపతి అబ్బాయి అజరు ఆ దేశ పౌరురాలు సిమోనెతో ప్రేమలో పడ్డాడు. పెద్దల అంగీకారంతో ఖండాంతరాలు దాటిన ఈ ప్రేమ పెళ్లికి టీటీడీ శ్రీపద్మావతీ కళ్యాణ మండపం బ్లాక్ -2 వేదికైంది. పెద్దల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం వేడుకగా జరిగింది. వివాహ వేడుకకు తుడా ఛైర్మెన్ హాజరు… తనకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మీ కుమారుడు అజరు.. అంతే కాకుండా పెళ్లికొడుకు స్నేహితుడు కావడంతో వివాహానికి తుడా ఛైర్మెన్ హాజరయ్యారు. వధూవరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మరో తనయుడు హర్షిత్రెడ్డి కూడా వివాహానికి హాజరయ్యారు.