తాత్కాలికంగా ‘స్పందన’ రద్దు

ప్రతి సోమవారమూ జిల్లా పరిషత్‌ సమావేశ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ప్రతి సోమవారమూ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ (స్పందన) కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు డిఆర్‌ఒ ఎం.గణపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వినతుల స్పందనను తాత్కాలికంగా నిలుపుదల చేశామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత వినతుల స్వీకరణపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రజలు వ్యయ ప్రయాసల కోర్చి ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని సూచించారు.

➡️