తాడేపల్లిగూడెం అర్బన్‌ రీ సర్వే పూర్తి

Jan 11,2024 21:02

టీమ్‌కు జెసి రామ్‌సుందర్‌రెడ్డి అభినందన
నేడు నోటిఫికేషన్‌ జారీ
ప్రజాశక్తి – భీమవరం
దేశంలోనే పైలెట్‌ ప్రాజెక్టుగా ఉన్న తాడేపల్లిగూడెం అర్బన్‌ రీ సర్వే పూర్తవ్వడం అభినందనీయమని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి అన్నారు. దిగ్విజయంగా పూర్తి చేసిన టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించి ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో తాడేపల్లిగూడెం అర్బన్‌ రీ సర్వే పూర్తి, 12వ తేదీ నోటిఫికేషన్‌ జారీ పలు అంశాలపై ఆర్‌డిఒ కె.చెన్నయ్య, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, సంబంధిత అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ ఎ.శామ్యూల్‌, తహశీల్దార్‌ ఎస్‌.శివశంకర్‌, జిల్లా కలెక్టరేట్‌ ల్యాండ్‌ తహశీల్దార్‌ సిహెచ్‌.రవికుమార్‌, సహాయ సిటీ ప్లానర్‌ జి.సీతారామ్‌, మండల సర్వేయర్‌ ఆర్‌.రామకృష్ణ, ఐటి టీమ్స్‌, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️