తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయరాదు

ప్రజాశక్తి-శింగరాయకొండ : కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కష్టాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులు వధా చేయొద్దని పిఎన్‌సిఎ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.గీతారాణి తెలిపారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు వీడ్కోలు సభ సోమవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గీతారాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించుకొని చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారన్నారు. పిఎన్‌సిఎ విద్యాసంస్థలు విద్యార్థుల చదువు విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. విద్యార్థుల కష్టపడి చదివితే తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపల్‌ డి.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️