తమిళనాడు : సంక్రాంతి వేళ … తమిళనాడులో ఈ సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు వేడుకలో అపశృతి జరిగింది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల దాడిలో ఒకరు చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, తిరుచిరాపల్లి జిల్లా సురియూర్ గ్రామంలో జల్లికట్టు చూడటానికి వచ్చిన అరవింద్ (25) అనే యువకుడిని ఎద్దు ఢకొీట్టడంతో మృతి చెందాడు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.