తప్పని డోలి మోత

Jan 5,2024 21:02

ప్రజాశక్తి-శృంగవరపుకోట  : మండలంలోని గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక గిరిజనులకు ఏ చిన్న కష్టమొచ్చినా డోలి మోత తప్పడం లేదు. మూలబొడ్డవర పంచాయతీ చిట్టంపాడు గ్రామానికి చెందిన మాదల గంగమ్మ, ఆమె చంటి బిడ్డ తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. దీంతో భర్త గంగులు తోటి గిరిజనుల సహాయంతో శుక్రవారం వారిని డోలిలో మోసుకుంటూ వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

➡️