డెంగీ బారిన వెదుళ్లపాలెంవాసులు

Dec 3,2023 17:46

ఒకరు మృతి, చికిత్స పొందుతున్న 9 మంది
అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల వేడుకోలు
ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌
మండలంలోని లంకల కోడేరు పంచాయతీ పరిధిలోని వెదుళ్లపాలెంలో పలువురు అనారోగ్యాలకు గురై పాలకొల్లు ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని 13వ వార్డు మెంబర్‌ మాదు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన ఇర్రింకి శంకరం (55) డెంగీ వ్యాధితో రక్త కణాలు క్షీణించి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారన్నారు. తొమ్మిది మంది వరకు ఈ డెంగీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారన్నారు. దీనిపై వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకుని తమకు అండగా నిలవాలని సుబ్రహ్మణ్యం కోరారు.

➡️