డప్పు కళాకారులకు పింఛన్‌ మంజూరు చేయాలి

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్రంలో డప్పు కళాకారులకు పింఛన్‌ మంజూరు చేయాలని ఆ సంఘ నాయకులు దర్శిలోని ఏఎస్‌డబ్ల్యూఓ రిజయాబేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి ఆర్‌ మోషే, ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా డప్పు కళాకారులు పింఛన్‌ కోసం పోరాటం చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యలమంద, యహెజ్కేలు, సాల్మన్‌ పాల్గొన్నారు.

➡️