టీటీడీ అటవీ కార్మికుల నిరవధిక దీక్షలకు ఆటంకాలు కల్పించవద్దుఎస్పీకి సిఐటియు విజ్ఞప్తిప్రజాశక్తి- తిరుపతి టౌన్: మూడు సంవత్సరాల రెండు నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా టిటిడి అటవీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, అనివార్యమైన స్థితిలో ఈనెల 27వ తేదీనుంచి నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకుంటున్నామని ఆటంకాలు కల్పించవద్దని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి కార్మికులు, సిఐటియు, రిపబ్లికన్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, రిపబ్లికన్ పార్టీ నేత పూతలపట్టు అంజయ్య, అటవీ కార్మిక సంఘం నేతలు ఈశ్వర్ రెడ్డి, సురేష్, సురేంద్ర, కష్ణమూర్తిలు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.