జీలుగుమిల్లి : జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా టి.క్రాంతి కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా అమలాపురం టౌన్ నుంచి జీలుగుమిల్లి సర్కిల్కు బదిలీపై వచ్చినట్లు తెలిపారు. గతంలో ఇక్కడ పని చేసిన వెంకటేశ్వరావును విజయవాడ కమిషనరేట్కు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో జీలుగుమిల్లికి నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించడంతో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.