జాతీయ క్రికెట్‌ పోటీలకు పాలకొల్లు విద్యార్థి

ప్రజాశక్తి – పాలకొల్లు
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంలో నిర్వహించిన అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీల్లో ఎవిఎస్‌ఎన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థి షేక్‌ సమీరుద్దీన్‌ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి 24 వరకు బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగే జాతీయస్థాయి క్రికెట్‌ పోటీల్లో ఆడనున్నాడు. సమీరుద్దీన్‌ని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోపీ, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్‌.విష్ణుమూర్తి, పీడీ వి.పేర్రాజు అభినందించారు.

➡️