నల్లగొండ : విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మరమ్మతులు చేయడంతో రైలు తిప్పర్తి స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బయల్దేరింది. అయితే బ్రేకులు పట్టేయడంతో ఆ రాపిడికి వీల్స్ నుంచి పొగ వచ్చిందని తిప్పర్తి రైల్వే స్టేషన్ మాస్టర్ రాయుడు తెలిపారు.