మాట్లాడుతున్న మనుక్రాంత్రెడ్డి
జనసేన కార్యకర్తలకు గుర్తింపు
ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజరు బాబుతో కలిసి పలువురికి నియామక పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ నెల్లూరు నగర జనసేన ఆధ్వర్యంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న 15 మంది నగర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్సులు, 20వ డివిజన్ ఇన్ఛార్జిలను నియమించారు. జనసేన పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు లభిస్తుందన్నారు. నూతనంగా నియమించబడిన వారు పార్టీ గెలుపు కోసం కషి చేయాలని పిలుపునిచ్చారు. 20 వ డివిజన్ ఇన్చార్జిగా భార్గవ్ , నగర కార్యదర్శులుగా ప్రతాప్ , సునీత ,మహేష్ సింగ్ , వినరు , కార్తీక్ .. సంయుక్త కార్యదర్శులుగా మణికంఠ , సదాశివం, అమీర్ జాన్ , వంశీ తదితరులను నియమించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి జిల్లా కార్యదర్శి షేక్ అలియా నగర ప్రధాన కార్య దర్శులు కాంతర్ , కరీం నగర ఇంచార్జులు పవన్, అనుదీప్ , శ్రీనివాస్ ముదిరాజ్ , శనివారపు అజయబాబు , శ్రీమంతుల కిషోర్ ఉన్నారు.