చైనా : చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనాలోని వాయువ్య గన్స్, కింగ్హై ప్రావిన్స్ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. సుమారు 110 మంది మృతి చెందారు. 200 మందికిపైగానే గాయపడినట్టు తెలుస్తుంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అర్థరాత్రి దాటాక ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు బయటకు వచ్చే సరికి ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానిక సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.