వినుకొండ: వినుకొండకు చెందిన సీనియర్ చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్ కు మరోసారి ప్రథమ బహుమతి లభించింది. విజయ వాడ ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కతిక వేదిక,ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో, రైతుల ఆక్రందన- మిచౌంగ్ తుపాను అనే అంశంపై సోమవారం నిర్వహించిన చిత్రకళా పోటీల్లో వినుకొండకు చెందిన జెస్టిస్ వజ్రగిరి గీసిన ‘రైతుల ఆక్రందన’ చిత్రానికి ప్రథమ బహుమతి ప్రక టించారు. ఫిబ్రవరిలో జరగబోయే కార ్యక్రమం లో ఈ బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జెస్టిస్ను స్థానిక మిత్రులు చిత్రకళాకారులు, రాజకీయ ప్రముఖులు, కవులు,రచయితలు, అభినందించారు,