చింతలపూడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటా

వెంపా దుర్గారావు

ప్రజాశక్తి – చింతలపూడి

చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏ స్వార్థము లేకుండా రాజకీయాల్లోకి వచ్చినట్లు స్వతంత్ర అభ్యర్థి వెంపా దుర్గారావు అన్నారు. చింతలపూడి పట్టణంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1951 సంవత్సరంలో చింతలపూడి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సరిహద్దు ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట వంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ చింతలపూడికి ఏమాత్రం అభివృద్ధి లేదని అన్నారు. నియోజకవర్గానికి మూలమైన చింతలపూడికి ఏం కావాలో నాకు తెలుసు. నియోజకవర్గంలో పలు ప్రాంతాలు కనీస రహదారి మరమ్మత్తులకు నోచుకోలేదు, యుద్ధ ప్రాతిపదికన వాటిని నిర్మించగలగాలని అన్నారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదని, అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలతో, యువతతో మమేకమై వాళ్ల అభిప్రాయాలను సేకరించి ఒక నిర్ణయానికి రావడం జరిగిందన్నారు. మన ఊరు-మన ప్రగతి అనే నినాదంతో ముందుకు సాగుతున్నాట్లు తెలియజేశారు.

➡️