చింతపల్లిలో గడప గడపకు..

ప్రజాశక్తి – పూసపాటిరేగ: ఇల్లవద్దకే సంక్షేమ పధకాలును అందించిన ప్రభుత్వం వైసిపిదేనని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయడు అన్నారు. గురువారం మండలంలోని చింతపల్లి సచివాలయం-2 పరిధిలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి రమేష్‌, నాయకులు జనార్దన్‌, జిల్లా మత్స్యకార సంఘ నాయకులు బర్రి చిన్నప్పన్న, సర్పంచ్‌ బర్రి ముసలి, నాయకులు పబ్బిరెడ్డి అప్పలడుదొర, బర్రి దాసు, ఎంపిడిఒ రాధిక తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కోనుగోలు కేంద్ర ప్రారంభంమండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుందీ ప్రభత్వం అన్నారు. రైతుకు ఆదుకోవడానికి ఈ ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ పిఎసిఎస్‌ చైర్మన్‌ మహంతి లక్ష్మణరావు, సర్పంచి టి. సీతారాం, ఎఒ నీలిమ తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️