ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్ ) : దొరసానిపల్లి పంచాయతీ రామాపురంలో సిఎస్ఐ చర్చి నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన నిధులలో నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తూ స్థానిక చర్చి పెద్దలకు శుక్రవారం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సమన్యాయం జరుగు తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రామా పురంలోని స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు తనను కలిసి చర్చి విషయమై చర్చించారన్నారు. ప్రభు త్వానికి నివేదిక పంపించి రూ.25 లక్షలు మంజూరు చేశారన్నారు అనంతరం రామాపురం వైసిపి నాయకులు యాకోబు కుమారుడు, జడ్పి వైస్ చైర్మన్ జేస్తాది శారద తమ్ముని వివాహానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వ దించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి, మున్సి పల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి,ఖాజా మొద్దీన్, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.