ఫొటో : మాట్లాడుతున్న ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి
చట్టాలపై అవగాహన అవసరం
ప్రజాశక్తి-ఉదయగిరి : చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి జె.అంజయ్య పేర్కొన్నారు. శనివారం ఉదయగిరి మండలం గండిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, సివిల్ జడ్జీ పాల్గొని మాట్లాడుతూ పోక్సో యాక్ట్ ఆవశ్యకత విధివిధానాలు, మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై తీసుకునే శాఖాపరమైన చర్యలు, పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్పన, హెచ్ఎం వెంకటేశ్వర్లు, అడ్వకేట్లు రామారావు, షరీఫ్, సుధాకర్, నాగార్జున, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రియాజ్, గ్రామపెద్దలు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.