గురుకుల విద్యార్థుల సత్తా

Dec 23,2023 21:34

ప్రజాశక్తి-కొమరాడ  :   జోనల్‌ స్థాయి క్రీడా పోటీల్లో అండర్‌-17 విభాగంలో కొమరాడ గిరిజన సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు తెలిపారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్‌, ఇతర సిబ్బంది శనివారం అభినందించారు. గురుకుల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో కె.శ్రీను అత్యధిక పతకాలు సాధించి, వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ని సాధించాడు. గురుకుల విద్యార్థులు 8 బంగారు, 7 వెండి, 3 కాంస్య పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్‌ వివరించారు. వీరు ఈనెల 28 నుంచి పాచిపెంట మండలం పి.కోనవలస గురుకులంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.గుమ్మలక్ష్మీపురం : జోనల్‌ స్థాయి స్పోర్ట్స్‌ మీట్లో భద్రగిరి గిరిజన గురుకుల పిటిజి బాలికల పాఠశాలకు ఆల్‌రౌండ్‌ ఛాంపియన్షిప్‌ లభించింది. వాలీబాల్‌ లో మొదటి స్థానం లభించింది. ఇండివిడ్యువల్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రణీతకు మొదటి స్థానం లభించిందని ప్రిన్సిపాల్‌ యుగంధర్‌, పిడి చంద్రమౌళి, పిఇటి అరుణ తెలిపారు.

➡️