గుడి పేరుతో.. ప్రభుత్వ భూమి దోపిడీ..

ప్రజాశక్తి-మార్కాపురం: ‘గుడి’ పేరుతో ప్రభుత్వ భూమి ‘దోపిడీ’కి గురవుతోంది. మార్కాపురం పట్టణ సమీపంలోని వేముల కోట ఇలాఖాలో గల సర్వే నెంబరు 164లో 0.33 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ప్రధాన రహదారికి అనుకుని ఉండటం… వ్యాపార నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్నందున దాని విలువ రూ. 2 కోట్లకు చేరింది. ఇదే భూమి వెనుక వైపున ఓ రియల్టర్‌కు చెందిన భూమి ఉంది. అందులో ఫ్లాట్లు వేశాడు. ప్రభుత్వ భూమిని కలుపుకుంటే అక్కడ ఫ్లాట్ల విలువ మరింత పెరుగుతుందనే స్వార్ధంతో గుడి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాడు. ఈ విషయం రెవెన్యూ పెద్దలకు తెలిసి కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చొరవ చూపిస్తే తప్ప విలువైన భూమి దక్కేలా లేదు.

➡️