ప్రజాశక్తి – హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ 500 పైగా నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న గన్నవరంలోని తమ క్యాంపస్లలో నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొంది. టెక్నాలజీలో మూడు లేదా ఎక్కువ సంవత్సరాల పని అనుభవంతో ఉన్న నిపుణులకు అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ”మా విభిన్నమైన సిబ్బంది ఇక్కడ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సాంకేతిక పురోగతిలలో నిపుణుల నైపుణ్యాలతో 100కిపైగా అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందిస్తున్నాము. ఈ మెగా నియామకం డ్రైవ్ ద్వారా టెకీలకు అవకాశాలు కల్పించడానికి ఉత్సాహంగా ఉన్నాము.” అని హెచ్సిఎల్ టెక్ విజయవాడ సెంటర్ ప్రధాన అధికారి శివ ప్రసాద్ పేర్కొన్నారు. తమ విజయవాడ క్యాంపస్లో 43 శాతం మహిళ ఉద్యోగులున్నారని తెలిపారు.