మృతుడు కిషోర్ (ఫైల్)
ప్రజాశక్తి – దుగ్గిరాల : ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని వీర్లపాలేనికి కౌలురైతు నెమలికంటి కిషోర్ (46) బుధవారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కిషోర్కు కుమార్తె, కుమారుడు ఉండగా ఏడాది కిందట తన కుమార్తె వివాహం చేశాడు. ఇందుకుగాను రూ.రెండు లక్షల వరకూ అప్పులయ్యాయి. మరోవైపు తాను కౌలుకు సాగు చేస్తున్న ఐదెకరాల వరి ఇటీవల తుపానుకు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అప్పుల ఒత్తిడి పెరిగి తీవ్ర మనస్థాపానికి గురైన కిషోర్ మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కిషోర్ బుధవారం మరణించాడు. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.