ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 30వ డివిజన్ ధర్మపురిలో ఏర్పాటుచేసిన కుళాయి కనెక్షన్లను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పతివాడ గణపతిరావు, వైసిపి నాయకులు కనకల కృష్ణ మాట్లాడుతూ ధర్మపురిలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు నీటికి ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. సమస్య తెలుసుకున్న కోలగట్ల రూ.20 కోట్లు మంజూరు చేయించి వాటర్ ట్యాంకును నిర్మించి, కుళాయి కనెక్షన్లను ప్రారంభించి ప్రజల దాహార్తిని తీర్చారని కొనియాడారు. కార్యక్రమంలో వైసిపి డివిజన్ అధ్యక్షులు పూసర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.