కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

Mar 26,2024 19:42
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

మృతిచెందిన గొర్రె పిల్లలు
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి
ప్రజాశక్తి -లింగసముద్రం : వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరు గొర్రె పిల్లలు మృతిచెందిన సంఘఠన మంగళవారం చోటుచేసుకుంది.మండలంలోని వెంగళాపురం గ్రామానికి చెందిన గువ్వల వెంకటేశ్వర్లుకు చెందిన గొర్రె పిల్లలుపై కుక్కలు దాడి చేయడంతో ఆరు గొర్రెపిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరో ఐదు గొర్రె పిల్లలను తీవ్రంగా కుక్కలు గాయపరిచాయి. దీంతో సుమారు 60వేలు నష్టం జరిగిందని యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు.

➡️