ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో చివరిసారిగా కేంద్ర మంత్రివర్గం మరి కాసేపట్లో సమావేశం కానుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధాని తన మంత్రివర్గ సహచరులకు వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమేటిక్ ఎన్క్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. కాగా, ఈ సమావేశంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై కూడా ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.