‘కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

Dec 23,2023 19:58

మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, ఇస్మాయిల్‌, జయరాజు, సిఐటియు మండల కార్యదర్శి బి.రాముడు డిమాండ్‌ చేశారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ అప్కాస్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఈనెల 26 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు మునీంద్ర, పల్లవి రాజు, పెద్ద కేశన్న, సాల్మన్‌, వీరేష్‌, తిక్కయ్య పాల్గొన్నారు.

➡️