ప్రజాశక్తి-శింగరాయకొండ శింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నేలపాటి బాల శంకర్ బాబుకు చెందిన కారు శుక్రవారం తెల్లవారుజామున చోరీకి గురైంది. దీంతో బాలశంకర్ టి.శ్రీరామ్కు సమాచారం అందించారు. స్పందించిన ఎస్ఐ టి.శ్రీరామ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. హైవే మొబైల్ వాహనాలు, హైవే పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో కారు యజమాని శంకర్ బాబు సెల్కు టంగుటూరు టోల్ గేట్ వద్ద పాస్ట్రాక్ ద్వారా నగదు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విషయం గురించి ఎస్ఐకు సమాచారం అందించాడు. మద్దిపాడు మండలం గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జాయతీ రహదారిపై పోలీసులు కేడ్లు అడ్డంపెట్టి అటుగా వచ్చిన కారును స్వాధీనం చేసుకున్నారు. కారు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని మద్దిపాడు పోలీస్ స్టేషన్కు తరలిసంచారు. నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించి పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి కారు దొంగను చేజింగ్ చేసి పట్టుకున్న ఎస్ఐటి శ్రీరామ్, పోలీసు సిబ్బందిన పలువురు అభినందించారు.