ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బూచేపల్లివెంకాయమ్మ సుబ్బారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లివెంకాయమ్మ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు.మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిసుబ్బారెడ్డి ఆశయాల కనుగుణంగా అన్నదానం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులకు తమ ట్రస్టు ద్వారా నెల రోజులపాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.లయన్స్క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి. జవహర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందించడం ద్వారా వారు చదువుపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు గెలాక్సీ అధినేత చలువాది బదరీ నారాయణ, కళాశాల ప్రిన్సిపల్ ఆలీబాబు, కౌన్సిలర్లు ఎస్కె.ఖాజా,ఇందిర పాల్గొన్నారు.