ప్రజాశక్తి-పొదిలి: మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కందుల నారాయణరెడ్డిని పొదిలి, కొనకనమిట్ల మండలాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు ఆయన నివాసంలో కలిసి బొకేలందించి పెద్దఎత్తున శాలువాలతో సన్మానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పొదిలి, కొనకనమిట్ల టిడిపి నాయకులు కాటూరి వెంకట నారాయణబాబు, నారాయణ, ప్రతాప్, మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖుర్దూస్, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, యాసిన్, సయ్యద్ ఇమాంసాహెబ్, నేరెళ్ల శ్రీనివాసులు, టెంట్ హౌస్ నరసింహారావు, భూమా సుబ్బయ్య, షేక్ గౌస్ బాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.