తిరుపతి టౌన్ : డాక్టర్ వై.యస్.ఆర్. కంటి వెలుగు పథకం ద్వారా లబ్ధిదారులకు కంటి అద్దాలను నగర మేయర్ డాక్టర్ శిరీష అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గతంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న థ్యేయమని, అందులో భాగంగా ఉచిత వైద్యం అందించారని, కంటికి సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. శనివారం 27వ డివిజన్ సంబంధించి కంటి అద్దాలను లబ్ధిదారులకు అందజేశారు.