ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్టిఆర్) :కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చలో విజయవాడకు తరలివెళ్తుండా.. వారిని దొనబండ చెక్ పోస్ట్ వద్ద గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదంటూ, నిలువరించి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తీరును, పోలీసులు అక్రమ అరెస్టును ఆశా కార్యకర్థలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఆందోళన చేపట్టారు.