ఏలూరుపాడులో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు
ప్రజాశక్తి – కాళ్ల
మండలంలోని ఏలూరుపాడు గ్రామంలో రూ.50 లక్షలతో సిమెంట్‌ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించనున్నామని వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు చెప్పారు. ఏలూరుపాడులో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏలూరుపాడు గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా సుమారు రూ.40 లక్షలతో నాలుగు సీసీ రోడ్లు, నాలుగు సీసీ డ్రెయినేజీ, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ సహాయ నిధులు సుమారు రూ.10 లక్షలతో సీసీ డ్రెయినేజీ మొత్తం రూ.50 లక్షలతో ఐదు సీసీ డ్రెయినేజీలు, నాలుగు సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, ఎంప ిపి పెన్మెత్స శిరీష విశ్వనాధరాజు, సర్పంచి భూపతిరాజు జగ్గరాజు, ఎంపిటిసి సభ్యులు చిన్నాపరపు రాంబాబు, వైసిపి గ్రామ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

➡️