ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి

Dec 5,2023 22:06
ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి

ప్రజాశక్తి- పులిచెర్లమండలం ఎర్రపాపిరెడ్డి గారిపల్లి పంచాయతీ గేటుకాడ బెస్తపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మతి చెందారు. ఎస్‌ఐ రవిప్రకాష్‌ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రపాపిరెడ్డి గారిపల్లికి చెందిన మస్తాన్‌(35) పశువులను మేపుకునేందుకు గ్రామానికి సమీపంలో ఉన్న కష్ణమ్మ చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడే సంచరిస్తున్న ఎనిమిది ఏనుగుల గుంపు ఒక్కసారిగా మస్తాన్‌పై దాడి చేయడంతో మస్తాన్‌ అక్కడికక్కడే మతిచెందాడు. స్థానికులు గుర్తించి కల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రవిప్రకాష్‌ రెడ్డి మస్తాన్‌ మతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

➡️