ఎర్రచందనం కూలీలు ఆరుగురు అరెస్టు

ఎర్రచందనం కూలీలు ఆరుగురు అరెస్టు

ఎర్రచందనం కూలీలు ఆరుగురు అరెస్టుప్రజాశక్తి – తిరుపతి (మంగళం)చంద్రగిరి సమీపంలోని భాకరాపేట అటవీప్రాంతంలో గొడ్డళ్లు, రంపాలతో చొరబడుతున్న ఆరుగురిని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు ఆర్‌ ఐ సురేష్‌ కుమార్‌ రెడ్డికి చెందిన ఏఆర్‌ ఎస్‌ ఐ మహేశ్వర నాయుడు టీమ్‌ భాకరాపేట అనంతపురం హై వే లోని ఒక ప్రయివేటు కాలేజ్‌ ఎదురుగా ఉన్న అడవుల్లో కూంబింగ్‌ చేపట్టారు. అక్కడ కొంతమంది వ్యక్తులు అడవుల్లోకి చొరబడుతుండగా వారిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఆరుగురిని పట్టుకో గలిగారు. వారిని సత్యసాయి జిల్లాకు చెందిన హరి (43), తిరుపతి రూరల్‌ కు చెందిన మురగయ్య (27), తమిళనాడు కళ్లకురిచ్చి కి చెందిన వెల్‌ మురుగన్‌ (46), ఏలుమలై (46), మురుగన్‌ తంగవేల్‌ (37), మహేంద్రన్‌ మురుగేషన్‌ (30) లను అరెస్ట్‌ చేశారు. తప్పించుకున్న మరో ఆరుగురు కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారి నుంచి 3 బస్తాల్లో గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు స్టేషన్‌ లో నమోదు చేయగా సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️