ఎంపిడిఒ మల్లీశ్వరికి సన్మానం

ప్రజాశక్తి – ముదినేపల్లి

ముదినేపల్లి మండల ఎంపిడిఒగా పనిచేసి ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీపై పల్నాడు జిల్లా పెదకూరపాడు వెళ్లిన మల్లీశ్వరికి ఘనంగా సన్మానం జరిగింది. సోమవారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తొలుత మల్లీశ్వరిని ఎంపిపి సత్యనారాయణ, జెడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ దంపతులు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య దంపతులు, వైస్‌ ఎంపిపిలు రాదా, సునీత ఘనంగా సన్మానించారు. నూతన ఎంపిడిఒగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మురళీ గంగాధర్‌ను కూడా సన్మానించి అభినందనలు తెలిపారు.

➡️