ఉల్లాసంగా ఉత్సాహంగా…

సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంత

వజ్రపుకొత్తూరు : సందడి చేస్తున్న సందర్శకులు

ప్రజాశక్తి- నౌపడ

సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన భావనపాడు, మేఘవరం, సున్నాపల్లి ప్రాంతమంతా సందర్శకులతో ఆదివారం సందడి నెలకొంది. విహారి యాత్రికులు, యువత, మహిళలు కేరింతలతో తీర ప్రాంతం కిటకిటలాడింది. అధిక సంఖ్యలో వచ్చిన యాత్రికులు తోటలలో సేదతీరి, సముద్ర స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. వయసుతో సంబంధం లేకుండా ఆటలతో, పాటలతో కేరింతల కొడుతూ సందర్శకులు ఉల్లాసంగా గడిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నౌపడ పోలీసులు, భావనపాడు మెరైన్‌ పోలీసులు సంయుక్తంగా పహారా కాశారు. ప్రమాద హెచ్చరికలు సూచిస్తూ అవగాహన కల్పించారు. సాయంత్రం వేళల్లో రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్‌ నిర్వహణ లేకపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. వజ్రపుకొత్తూరు: మండలంలోని అక్కుపల్లి శివసాగర్‌ తీరంలో ఆదివారం పర్యాటకులు ఉల్లాసంగా… ఉత్సాహంగా సేదతీరారు. సుదూర ప్రాంతాల నుంచి మహిళలు, పిల్లలు, యువకులు సాగరతీరానికి చేరుకుని సందడి చేశారు. సముద్ర స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, గారబంద తదితర ప్రాంతాల నుంచీ పర్యాటకులు తరలివచ్చారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

 

➡️