ప్రజాశక్తి-పాకాల(తిరుపతి) :పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రి వైద్య బృందం, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ సహాయ సహకారాలతో ఆదివారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పాకాలలో ప్రతి నెల మూడో ఆదివారం జరిగే ఈ శిబిరంలో 65 మందికి పరిక్షలు నిర్వహించగా వీరిలో 15 మందికి ఆపరేషన్లు చేయాలని వైద్య బృందం నిర్ధారించింది. వీరిని సోమవారం మధ్యాహ్నం చెన్నై శంకర్ నేత్రాలయంలో చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ ప్రతినిధులు జయరామ నాయుడు, కుప్పస్వామి నాయుడు,పోతుగుంట అనీల్ కుమార్,అలాగే పాకాల లియో క్లబ్ అధ్యక్షుడు గుండ్లూరు దొర పార్థు,పాకాల ఉన్నత పాఠశాల లియో అధ్యక్షుడు ఎల్ జశ్వంత్,లియో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.