భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమి
అనంతపురం కలెక్టరేట్ : అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఉన్న ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ ఎం.గౌతమి బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను పరిశీలించారు. అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, భద్రతా చర్యలను పరిశీలన చేశారు. ఆమె వెంట ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ భాస్కర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.