ఈపూరు మత్స్య సహకార సంఘం ఎన్నికలు జరిపించండి

మాట్లాడుతున్న మత్స్య సహకార సంఘ సభ్యులు

ఈపూరు: మండల కేంద్రం ఈపూరులోని రాపర్ల వారి చెరువు మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు జరిపించాలని మత్స్య సహకార సంఘ సభ్యులు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం స్పందనలో జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు ఆత్మకూరు వెంకటేశ్వర్లు,ముద్దా శీను మాట్లాడుతూ సహకార సంఘ అధ్యక్షుడు పదవీకాలం 2023 ఫిబ్రవరి తో ముగిసిందని 2023 ఏప్రిల్‌ 11వ తేదీన ఎన్నికల నిర్వహించేలా మత్స్యశాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఎన్నికలకు రెండు రోజులు ముందు స్థానిక ప్రజా ప్రతినిధి కోర్టు స్టే ద్వారా ఎన్నికలను అడ్డుకున్నారని ఆరో పించారు. మొత్తం 62 మంది సభ్యులు ఉండగా అధికార పార్టీకి అనుకూలంగా పదిమంది సభ్యులు ఉన్నారనే కారణంతో ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని, మత్స్య సహకార సంఘం ఎన్నికలు జరిపించాలంటూ తాము కోర్టుని ఆశ్రయించామని తెలిపారు.

➡️