ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్స్థానిక ఎఫ్సిఐ గొడౌన్లో ఏర్పాటు చేసిన ఇవిఎంలను కలెక్టర్ మాధవీలత బుధవారం పలు రాజకీయ పార్టీలతో కలిసి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఓటరు తుది జాబితా ప్రకటించామన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరీ జిల్లాకు కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు చెందిన యూనిట్స్ బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ను తనిఖీ చేసి భద్ర పరిచామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పోలీసు భద్రతతో పాటు, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్స్ పనితీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. కలెక్టర్ వెంట అర్బన్ తహశీల్దార్ వి.సుస్వాగతం, రాజకీయ పార్టీల ప్రతినిధులు నలబాటి రమేష్ (కాంగ్రెస్), వై.రాజశేఖర్, రాయుడు గణేష్ (వైసిపి) సలాది ఆనంద్ సిహెచ్.శ్రీనివాసరావు (టిడిపి), బి.రామచంద్రరావు (బిజెపి) కలెక్టరేట్ ఎన్నికల డిటి సునీల్ తదితరులు ఉన్నారు.