ఇళ్లస్థలాలు కేటాయించాలని నిరాహార దీక్షలు

Jan 30,2024 22:14

 నిరాహార దీక్షల్లో కార్మికులు, నాయకులు

                        ఓబుళదేవర చెరువు : మండలంలోని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లస్థలాలు, గృహాలు మంజూరు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శులు కుళ్లాయప్ప రమణ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ మండలంలోని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల పట్టాలతో సహా గృహాలు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఇళ్లస్థలాల కోసం గతంలో ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని విమర్శించారు. సమస్య పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప, సహాయ కార్యదర్శి కేశవ, నాయకులు రమణ, సూరి ,రవి, శ్రీనివాసులు మహేష్‌, సురేంద్ర, చాంద్‌ బాషా కేశవ, అంజనప్ప, నాగరాజు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️