ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు ప్రజాశక్తి -తిరుపతి సిటీ: గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపులో తీసుకున్నట్లు ఈస్ట్‌ సీఐ మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. స్థానిక ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో శుక్రవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాలతో రోజువారి తనిఖీల్లో భాగంగా రేణిగుంట రోడ్డు ఫ్లైఓవర్‌ పోస్టల్‌ కాలనీ క్రాస్‌ వద్ద ఫుట్‌ పెట్రోలింగ్‌ చేపట్టామన్నారు. అక్కడ అనుమానంతో తిరుగుతున్న ఇద్దరు నిందితులను అదుపులో తీసుకొని విచారించిగా, వారి వద్ద 5 కేజీల గంజాయి లభించిందన్నారు. వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సూళ్లూరుపేట తానేలి గ్రామానికి చెందిన సాయి కష్ణ, ప్రస్తుతం గ్రాండ్‌ వరల్డ్‌ సమీపంలోని ఎస్‌ఎల్వీ నగర్‌ లో కాపురం ఉంటున్నాడు, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం రాగిమోను పెంట గ్రామానికి చెందిన ముని చర్ల సాయి, ప్రస్తుతం తిరుపతి రూరల్‌ పంచాయతీలో కాపురం ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి పాడేరు నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి తిరుపతి నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. వీరి ఇరువురిపై ఎన్‌.డి.పి.ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్‌ సీఐ తెలిపారు.

➡️